బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న [more]

Update: 2020-08-06 13:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ లలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి నియమితులు కావడంతో ప్రభుత్వం ఇప్పట్లో ఎన్నికలకు సిద్ధం కాదు. మార్చి నెలలో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించడం వల్లనే ఈ పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags:    

Similar News