రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు

Update: 2018-11-23 14:20 GMT

మేడ్చెల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నేతలు మహేశ్వర్ రాజు, కనకరాజు, జహిరాబాద్ టీడీపీ నేత నరోత్తమ్, పలువురు మైనారిటీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వీరిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Similar News