పీకే గెలుస్తారో లేరో చెప్పిన లగడపాటి

ఆంధ్రప్రదేశ్ లో కచ్చితమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్, [more]

Update: 2019-05-18 13:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో కచ్చితమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గెలుపోటములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడని, అందుకే మెగా స్టార్ కు వచ్చిన సీట్ల కంటే తక్కువే వస్తాయని పేర్కొన్నారు. చిరంజీవికి 2009లో ఎన్నికల్లో ప్రస్తుత ఏపీలో 16 సీట్లు వచ్చాయి. ఈ లెక్కన జనసేనకు 16 సీట్ల కంటే తక్కువే వస్తాయని లగడపాటి అంచనా వేశారు. ఇక, పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని స్పష్టం చేశారు. జనసేన రాకతో టీడీపీ, వైసీపీ ఓట్లు తగ్గనున్నాయని చెప్పారు.

Tags:    

Similar News