Tdp : టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై

తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత కుతూహలమ్మ, ఆమె కుమారుడు హరికృష్ణ టీడీపీకి రాజీనామా చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి [more]

Update: 2021-10-19 01:31 GMT

తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత కుతూహలమ్మ, ఆమె కుమారుడు హరికృష్ణ టీడీపీకి రాజీనామా చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఉన్న హరికృష్ణతో పాటు ఆయన తల్లి కుతూహలమ్మ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పంపారు. ఇటీవల ఆ నియోజకవర్గానికి సమన్వయ కర్తను చంద్రబాబు నియమించారు. ఈ కారణంగానే వారిద్దరూ రాజీనామా చేశారని తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సీనియర్ నేత రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News