ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కొందరు కుట్రపన్నారు. అయితే ఈ కుట్రను కడప జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని [more]

Update: 2020-03-21 12:23 GMT

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కొందరు కుట్రపన్నారు. అయితే ఈ కుట్రను కడప జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ఈ గ్యాంగ్ యాభై లక్షల సుపారీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు పథకాన్ని కూడా ఈ గ్యాంగ్ ను సిద్ధం చేశారు. ఈ ముఠా నుంచి మూడున్నర లక్షల నగదును, ఒక రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎవరు హత్య చేయించాలనుకున్నదీ? సుపారీ ఎవరు ఈ గ్యాంగ్ కు ఇచ్చిందీ తదితర వివరాలు పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డికి భద్రత పెంచాలని కర్నూలు జిల్లా పోలీసులు నిర్ణయించారు.

Tags:    

Similar News