పరారీలో టీడీపీ నేత

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు వెదుకులాటను ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులను దూషించి, బెదిరించిన ఘటనపై పోలీసులు కూనరవికుమార్ పై కేసులు [more]

Update: 2019-08-28 03:23 GMT

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు వెదుకులాటను ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులను దూషించి, బెదిరించిన ఘటనపై పోలీసులు కూనరవికుమార్ పై కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. కూన రవికుమార్ తో పాటు మొత్తం 11 మంది పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కూన రవికుమార్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే అయిన కూనరవికుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News