కొనసాగుతున్న కుమారస్వామి టెంపుల్ రన్

Update: 2018-08-31 03:45 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడకు వస్తున్నారు. నిన్ననే ఆయన వంద రోజుల పాలన పూర్తయింది. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వరుస బెట్టి ఆలయాలు, మఠాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వాన్ని నాలుగు కాలాల పాటు కొనసాగించాలని కోరుతూ కుమారస్వామి ఎక్కిన మెట్టు ఎక్కకుండా మొక్కుకుంటున్నారు.

దుర్గగుడిలో ప్రత్యేక పూజలు.....

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడానికి ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి రాక సందర్భంగా కుమారస్వామికి ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు తదితరులు గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. కుమారస్వామి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఉండటం విశేషం. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా దుర్గగుడికి చేరుకున్న కుమారస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Similar News