మోదీ చెప్పింది నిజమే...!

Update: 2018-08-01 12:49 GMT

టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ లో చేరుతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త సొల్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉండేవారంతా తెలంగాణ ప్రజలేనని, కానీ కాంగ్రెస్ పార్టీ సెటిలర్ల పేరుతో విడదీస్తోందని విమర్వించారు. తప్పు చేస్తే జైలుకు పంపేది కోదండరాం, ఉత్తమ్ కాదని, కోర్టులు పంపాలని పేర్కొన్నారు. ప్రదాని మోడీ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీది బెయిల్ గాడీ అని, సోనియా, రాహుల్ గాంధీ కూడా బెయిల్ పై బయట ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న 75 సీట్లు దేశం మొత్తం మీద కాంగ్రెస్ కు వచ్చే ఎంపీ సీట్లు అయి ఉంటాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను గద్దె దించేవరకు గడ్డం తీసుకోమంటున్నారని, గడ్డం తీసుకోకపోతే సన్యాసుల్లో కలవడం ఖాయమని వ్యాఖ్యానించారు

Similar News