నేను బచ్చానైతే.. ఆయనేంది..?

Update: 2018-08-27 11:34 GMT

కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం తుంగతుర్తి ప్రాంతానికి చెందిన పలువురు నేతలు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు తనను బచ్చా అంటున్నారని, నేను బచ్చాను అయినా తనకంటే మూడేళ్లు పెద్దవాడేన రాహుల్ గాంధీ ఏంటని ప్రశ్నించారు. తమ కుటుంబంలో ఎవరో నామినేట్ చేస్తే రాజకీయాల్లోకి రాలేదని ప్రజలు గెలిపిస్తే వచ్చామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పేరు చివర గాంధీ లేకపోతే దేశ రాజకీయాల్లో ఉంటుండే వాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల లీడర్లు ఢిల్లీలో ఉంటే టీఆర్ఎస్ లీడర్లు గల్లీల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు బాత్ రూం పోవాలన్నా ఢిల్లీ పర్మీషన్ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ బాబు తట్టాబుట్టా సర్దుకుని పోతే గత్యంతరం లేక కాంగ్రెస్ లో చేరిన కొందరు నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. డబ్బాలల్లో, సంచులల్లో నోట్లు పెట్టే పని కాంగ్రెస్ నేతలకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు. అటువంటి పనుల్లో కాంగ్రెస్ నేతలు పీహెచ్ డీ చేశారని విమర్శించారు.

Similar News