హరీశ్ కు పార్టీని అప్పగిస్తే మళ్లీ చేరతా

టీఆర్ఎస్ పార్టీని హరీశ్ రావుకు అప్పగిస్తే తాను తిరిగి ఆ పార్టీలో చేరతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు కలసి [more]

Update: 2021-06-13 05:47 GMT

టీఆర్ఎస్ పార్టీని హరీశ్ రావుకు అప్పగిస్తే తాను తిరిగి ఆ పార్టీలో చేరతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు కలసి తెలంగాణలో నిరంకుశ పాలనను సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని, త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. అయితే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ను హుజూరాబాద్ లో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.

Tags:    

Similar News