బ్రేకింగ్ : కోమటిరెడ్డికి ఎర్త్..?

Update: 2018-09-21 07:27 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల నియామకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కమిటీల్లో బ్రోకర్లకు స్థానం ఇచ్చారని... వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వారిని తీసుకున్నారని రాజగోపాల్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జైళ్లకు వెళ్లి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణకు కుంతియా శనిలా దాపురించాడని విమర్శించారు. మరో సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో పీసీసీ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. మరికాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమై వీహెచ్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చించనున్నారు. రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News