కోడెల అంగీకరించారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కొంత ఫర్నీచర్ తన దగ్గర ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంగీకరించారు. హైదరాబాద్ నుంచి అమారావతికి తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను [more]

Update: 2019-08-20 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కొంత ఫర్నీచర్ తన దగ్గర ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంగీకరించారు. హైదరాబాద్ నుంచి అమారావతికి తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను ఉపయోగించుకున్నానన్నారు. ఫర్నీచర్ ను తీసుకెళ్లాలని పలుమార్లు అసెంబ్లీ అధికారులు దృష్టికి తాను తీసుకెళ్లినా వారు స్పందించలేదన్నారు. దీనిపై వారికి లేఖ కూడా రాశానని కోడెల చెప్పారు. ఇప్పుడైనా అధికారులు వస్తే ఫర్నిచర్ ను ఇస్తానని, పోనీ ఎంత ఖర్చయిందో చెబితే చెల్లిస్తానని కోడెల శివప్రసాద్ చెప్పారు.

Tags:    

Similar News