కోడెల మృతిపై అనుమానాలే

కోడెల మృతిపై అనుమానాస్పద కేసును నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఈ కేసుపై మూడు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే [more]

Update: 2019-09-16 11:21 GMT

కోడెల మృతిపై అనుమానాస్పద కేసును నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఈ కేసుపై మూడు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే కోడెల ఆత్మహత్య చేసుకున్నటువంటి గదిని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

కేసు అనుమానాస్పదమే…

శివప్రసాదరావు మరణంపై వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని తెలిపారు. కోడెల మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. కోడెల సూసైడ్ కు సంబంధించి ఎటువంటి నోట్ లభించలేదని ఆయన అన్నారు.

 

Tags:    

Similar News