బ్రేకింగ్ : రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ

Update: 2018-11-02 10:30 GMT

తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే టీకాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీలో మకాం వేసి అధిష్ఠానంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాహుల్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పలువురు టీకాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు తెలంగాణ జన సమితి అధినేత ప్రొ.కోదండరాం రాహుల్ గాంధీని కలిశారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రణాళికపై వీరి మధ్య చర్చ జరగనుంది. ఇప్పటికే 95 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో టీజేఎస్, సీపీఐ కి కలిపి 10 స్థానాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది.

Similar News