బాబూ కొడుకులిద్దరికీ తాట తీస్తా… నాని వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై ఫైర్ అయ్యారు. వారిద్దరూ ఇంటికే పరిమితమై జూమ్ తో కాలక్షేపం [more]

Update: 2021-06-19 05:57 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై ఫైర్ అయ్యారు. వారిద్దరూ ఇంటికే పరిమితమై జూమ్ తో కాలక్షేపం చేస్తున్నారన్నారు. గ్రామకక్షలతో ఎవరో చనిపోతే అక్కడకు లోకేష్ వెళ్లి జగన్ కు వార్నింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రైతులను మోసం చేసింది చంద్రబాబేనని కొడాలి నాని అన్నారు. గతంలో చంద్రబాబు రైతులకు నాలుగు వేల కోట్ల బకాయి పెడితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని చెల్లించామని చెప్పారు. రైతులపై చంద్రబాబు కపట ప్రేమను కనపరుస్తున్నారన్నారు. జగన్ పై అనవసరంగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. చంద్రబాబు చిటెకేసినా, లోకేష్ చప్పట్లు కొట్టినా జగన్ ను ఏమీ చేయలేరని కొడాలి నాని అన్నారు. హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడైనా సీబీఐ విచారణకు ఆదేశించారా? అని కొడాలి నాని హెచ్చరించారు.

Tags:    

Similar News