జగన్ పై మాట తూలితే అంతు చూస్తా.. నాని హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జగన్ పై [more]

Update: 2021-04-01 01:17 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జగన్ పై పిచ్చి వాగుడు వాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ దయతోనే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ కు తిరిగి వెళుతున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా పథ్నాలుగేళ్లు చేసినా అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. జగన్ ఒక్కొక్క నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినా చంద్రబాబు లో మార్పు రాలేదని కొడాలి నాని అన్నారు.

Tags:    

Similar News