ఆంక్షలపై హైకోర్టుకు కొడాలి నాని

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై విధించిన ఆంక్షలపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించనున్నారు. మంత్రి కొడాలి నానిని ఈ నెల 21వ [more]

Update: 2021-02-13 06:02 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై విధించిన ఆంక్షలపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించనున్నారు. మంత్రి కొడాలి నానిని ఈ నెల 21వ తేదీ వరకూ మీడియాతో మాట్లాడవద్దని, బహిరంగ సభల్లో పాల్గొన వద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. హైకోర్టుకు ఈరోజు, రేపు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటీషన్ వేయనున్నారు.

Tags:    

Similar News