బాబూ నీ సొల్లు పురాణం ఇక ఆపు.. కొడాలి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ప్రజా మద్దతున్న జగన్ ను ఎవరూ ఏం చేయలేరన్నారు. డబ్బా ఛానెళ్లు, పత్రికలు ఎన్ని ప్రయత్నాలు [more]

Update: 2021-02-12 04:52 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ప్రజా మద్దతున్న జగన్ ను ఎవరూ ఏం చేయలేరన్నారు. డబ్బా ఛానెళ్లు, పత్రికలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్యధిక పంచాయతీలు వైసీపీ గెలుచుకుందన్నారు. రేషన్ డోర్ డెలివరీని ఆపి విపక్షాలు కుట్ర చేశాయన్నారు. కుట్రలు చేయడం టీడీపీకి అలవాటేనన్నారు. పత్రికలను నమ్ముకుని తాము పాలన చేయడం లేదన్నారు. ఏకగ్రీవాలు జరుగుతున్న ప్రాంతాల్లో చంద్రబాబు విధ్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు పతనం ఎప్పుడో ప్రారంభమయిందన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత చంద్రబాబును, లోకేష్ ను గుడ్డలిప్పి కొట్టడం ఖాయమని కొడాలి నాని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు బతుకే అబద్ధమని కొడాలి నాని అన్నారు. రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారన్నారు. జూమ్ యాప్ లో చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారన్నారు. వైసీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. చంద్రబాబుకు ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ఫలితాలకే పిచ్చిలేచిందని, చిన్న మెదడు చితికిపోయిందని, రెండో దశ ఎన్నికల తర్వాత పుతిన్, బైడెన్ లకు కూడా లేఖలు రాస్తారన్నారు కొడాలి నాని.

Tags:    

Similar News