అందుకే వైసీపీలో చేరుతున్నా…

బీసీల అభివృద్ది వైఎస్ జగన్ ఆలోచనలు నచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె లోటస్ [more]

Update: 2019-02-19 07:19 GMT

బీసీల అభివృద్ది వైఎస్ జగన్ ఆలోచనలు నచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి జగన్ ప్రకటించిన డిక్లరేషన్ నచ్చిందన్నారు. బీసీల పట్ల జగన్ కు మంచి గౌరవం ఉందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి, బీసీలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని జేబులో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 28వ తేదీన అమరావతిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News