బీజేపీలో చేరిన ఖుష్బూ

సినీనటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీని వీడారు. కొద్దిసేపటి క్రితం ఖుష్బూ భారతీయ జనతా పార్టీలో చేరారు. మోదీ విధానాలకు ఆకర్షితురాలినై బీజేపీలో చేరినట్లు ఖష్బూ తెలిపారు. మోదీ [more]

Update: 2020-10-12 09:03 GMT

సినీనటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీని వీడారు. కొద్దిసేపటి క్రితం ఖుష్బూ భారతీయ జనతా పార్టీలో చేరారు. మోదీ విధానాలకు ఆకర్షితురాలినై బీజేపీలో చేరినట్లు ఖష్బూ తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళుతుందని ఖుష్బూ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని ఖుష్బూ తెలిపారు. తమిళనాడులో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఆమె అన్నారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఖుష్బూ పార్టీని వీడటం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర పరిణామమే.

Tags:    

Similar News