కాంగ్రెస్ గెలవలేదట..బీజేపీయే ఓడిందట…!!

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ [more]

Update: 2018-12-29 11:07 GMT

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విశ్లేషించారు. మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మార్కులు తెచ్చుకుందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ని ఓడించడమే లక్ష్యంగా చేసుకుని ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ను చూసి జనం ఓట్లు వేయలేదన్నారు. లోక్ సభ ఎన్నికలలో కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉంటుందను కుంటున్న సమయంలో కేజ్రీవాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అయోమయంలో పడేశాయి.

Tags:    

Similar News