కీలక సమావేశం… రేపు జాతినుద్దేశించి ప్రసంగం

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. లాక్ డౌన్ పై కీలక నిర్ణయం [more]

Update: 2020-05-01 07:16 GMT

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ లు హాజరయ్యారు. మే 3వ తేదీతో లాక్ డౌన్ గడువు ముగియనుంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను దేశ వ్యాప్తంగా ప్రకటించింది. గ్రీన్ జోన్లలో పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వనునన్ట్లు తెలుస్తోంది. రెడ్, ఆరెంజ్ జోన్లలో మాత్రం మరికొంత కాలం లాక్ డౌన్ ను పొడిగించనున్నారు. రేపు లాక్ డౌన్ పై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News