గడ్కరీ వల్లనే అది సాధ్యమయింది

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వల్లనే దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయంలో ఈ [more]

Update: 2020-08-24 06:01 GMT

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వల్లనే దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయంలో ఈ ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేశామన్నారు. బెజవాడ వాసుల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అసాధ్యమని అనేక పార్టీలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేశినేని నాని గుర్తు చేశారు. నితిన్ గడ్కరీకి బెజవాడ వాసులు రుణపడి ఉన్నారన్నారు. వచ్చే నెల 4వ తేదీన నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని కేశినేని నాని తెలిపారు.

Tags:    

Similar News