ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని తెచ్చా….!!!

తాను ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కూడా ఏపీకి తెచ్చుకోలేకపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు [more]

Update: 2018-12-29 13:35 GMT

తాను ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కూడా ఏపీకి తెచ్చుకోలేకపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా గెలవలేదన్నారు. ఆయన స్వయంప్రకాశం ఉన్న నేత కాన్నారు. మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కొని రాజకీయం నడిపారన్నారు. తాను అలా కాదన్నారు. తాను సొంతంగా ఉద్యమించి కష్టపడి నెగ్గానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే తాను అడ్డుపడ్డానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇస్తే తమకు కూడా ఇవ్వాలని మాత్రమే తాను అడిగానని కేసీఆర్ చెప్పారు. తాను ప్రతిపాదించే ఆర్థిక నమూనాపై చంద్రబాబుకు అవగాహన లేదన్నారు. చివరకు తాను ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మిని కూడా కాపీ కొట్టారన్నారు.

Tags:    

Similar News