బ్రేకింగ్ ; కేంద్రం సాయం ఉత్త బోగస్…మోసం..దగా

కరోనా సమయంలో కేంద్ర ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేంద్రం రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా భావిస్తుందన్నారు. కేంద్ర ప్రకటించని ప్యాకేజీని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. [more]

Update: 2020-05-18 15:11 GMT

కరోనా సమయంలో కేంద్ర ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేంద్రం రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా భావిస్తుందన్నారు. కేంద్ర ప్రకటించని ప్యాకేజీని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము అడిగింది ఇది కాదని కేసీఆర్ చెప్పారరు. రాష్ట్రం కట్టుకునే అప్పులకు కేంద్రం పెట్టే షరతులేంటని కేసీఆర్ ప్రశ్నించారు. అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ కూడా ఇవే చెబుతున్నాయన్నారు. కేంద్రం ప్యాకేజీ మోసం, దగా అని కేసీఆర్ చెప్పారు. అన్ని దరిద్రపు షరతులను కేంద్రం విధించిందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తుందన్నారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్రాలతో బేరాలేంటని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై ఇప్పుడే తాను మాట్లాడనన్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తామన్నారు. పోతిరెడ్డిపాడు మీద గతంలో కొట్లాడిందెవరని ప్రశ్నించారు.

Tags:    

Similar News