తనను నగరం నుంచి బహిష్కరించడంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీరాముడిపై ఓ టీవీ ఛానల్ చర్చలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కత్తి మహేష్ పై నగర పోలీసులు ఆరు నెలల బహిష్కరణ వేటు వేశారు. తర్వాత పరిపూర్ణానంద స్వామిపై కూడా నిషేదం విధించారు. అయితే, ఈ నిర్ణయంపై పరిపూర్ణనంద ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కత్తి మహేష్ కూడా హైకోర్టు గడప తొక్కారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మూడు వారాల సమయం ఇచ్చింది.