కొలువుదీరిన మంత్రివర్గం...

Update: 2018-06-06 09:40 GMT

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండువారాలకు ఎట్టకేలకు కర్ణాటకలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ వాజుభాయ్ వాలా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తుపెట్టుకున్న జేడీఎస్ మంత్రి వర్గంలో బీఎస్సీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రివర్గాన్ని ఖరారు చేశారు.

Similar News