బ్రేకింగ్ : జగన్ ను కలిసన కరణం బలరాం

చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఆయన తన కుమారుడు కరణం వెంకటేష్ తో కలసి జగన్ వద్దకు [more]

Update: 2020-03-12 11:52 GMT

చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఆయన తన కుమారుడు కరణం వెంకటేష్ తో కలసి జగన్ వద్దకు వచ్చారు. కరణం బలరాంను సాదరంగా జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా చీరాల నియజకవర్గం అభివృద్ధి గురించి ఆయన జగన్ తో చర్చించారు. కరణం వెంకటేష్ కు కండువా కప్పి వైసీపీలోకి జగన్ ఆహ్వానించారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన మూడో ఎమ్మెల్యే కరణం బలరాం. గతంలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News