మరి స్వీట్లెందుకు పంచుకున్నారు ?

Update: 2018-05-28 13:30 GMT

మహానాడు వేదికగా బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలుగుదేశం నిర్వహించేది మహానాడు కాదని మాయనాడు అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని, చంద్రబాబు అసమర్థత వల్లె రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని, ఎన్టీఆర్ పై చెప్పులేయించి ఆయన మరణానికి చంద్రబాబు కారణమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ కు అద్దె మైకుగా చంద్రబాబు మారాడని, కర్ణాటకలో ఓటేయొద్దని చెప్పినా తెలుగు ప్రాంతంలో 16 సీట్లు సాధించామన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాధించామని స్వీట్లు పంచుకున్న టీడీపీ ఇప్పుడు మాట ఎందుకు మార్చిందని ప్రశ్నించారు. టీటీడీలో అన్యాయం జరుగుతుందంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, టీటీడీపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Similar News