లాజిక్ లాగిన కన్నా లక్ష్మీనారాయణ

Update: 2018-10-26 11:47 GMT

ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు సూసైడ్ నోట్ రాయడం చూశాము కానీ హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం మాత్రం బాబు హయాంలోనే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...శాంతి భద్రతలు కాపాడే దమ్ము చంద్రబాబుకు లేదని, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ప్రశాంతం తిరిగే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని, అసలు ఆపరేషన్ గరుడ సృష్టికర్తే చంద్రబాబు అని ఆరోపించారు. ఏడాది సర్వీస్ ఉన్న ప్రసాదరావుని తప్పించి చంద్రబాబు తన బంధువును డీజీపీగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. హత్యాయత్నం జరిగినప్పుడు ముందు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్న చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగినప్పుడు స్టేషన్ కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అసమర్థ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదన్నారు.

Similar News