అక్కడ లేనివి ఇక్కడెందుకో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ [more]

Update: 2021-09-06 08:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. కరోనా నిబంధనలకు లోబడి అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్న ప్రభుత్వం చవితి వేడుకలకు మాత్రం ఆంక్షలు పెట్టడమేంటని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జయంతి, వర్థంతి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

Tags:    

Similar News