రేపు సీమ అభివృద్ధిపై సమావేశం

రాయలసీమ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదన్నారు. రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ నేతలు చర్చకు [more]

Update: 2021-08-31 07:12 GMT

రాయలసీమ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదన్నారు. రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ నేతలు చర్చకు రావాలని కాల్వ శ్రీనివాసులు సవాల్ విసిరారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంపై జగన్ నేరుగా సమాధానం చెప్పాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. రాయలసీమ అభివృద్ధిపై రేపు హైదరాబాద్ లో టీడీపీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని, ఇందులో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

Tags:    

Similar News