ఉత్సాహం ఉన్న వారంతా వైజాగ్ రండి

రాష్ట్రంలో తమ పార్టీ ఒక్కటే బడుగుల పార్టీ అని, మిగతా పార్టీలన్నీ కుటుంబ, కుల పార్టీలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మంగళవారం ఆయన [more]

Update: 2018-12-25 12:38 GMT

రాష్ట్రంలో తమ పార్టీ ఒక్కటే బడుగుల పార్టీ అని, మిగతా పార్టీలన్నీ కుటుంబ, కుల పార్టీలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అన్నింటా తామే నెంబర్ వన్ అంటున్నారని, అయితే క్రైమ్ లో మాత్రమే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఆయన చుట్టూ ఉన్న వారే బాగుపడ్డారని పేర్కొన్నారు. తనను థర్డ్ ఫ్రంట్ లోని పెద్ద నాయకులు ప్రత్యేకంగా కలుస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ నెల 29న విశాఖపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, పార్టీలో చేరాలని ఉత్సాహం ఉన్నవారు, తనను కలవాలని అనుకునే వారు విశాఖపట్నం రావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News