కేసీఆర్ నుంచి ప్రాణహాని

Update: 2018-11-26 02:58 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ లో పోలీసులు అరెస్ట్ చేశాక..హైబీపీ రావడంతో ఒంటేరును సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుని అర్థరాత్రి డిశ్చార్జ్ అయ్యారు. తెరాస ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తుందన్నారు ఒంటేరు. ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో తమ కార్యకర్తలను, తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 50 కోట్ల రూపాయలను పంపిణీ చేశారని.. జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అక్కడి పోలీసులు కెసిఆర్ కు వత్తాసు పలుకుతున్నారని.. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెరాస అరాచకాలపై పోరాడేందుకు ప్రాణాలు త్యాగం చేసేందుకు సైతం వెనుకాడనని.. ఆమరణ నిరాహార దీక్షను చేపడ్తానన్నారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి.

Similar News