గవర్నర్ వద్దకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళ్ సై ను కలవనున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ [more]

Update: 2019-11-25 08:46 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళ్ సై ను కలవనున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ తరచూ ఆయనతో సమావేశమయ్యారు. అయితే బీజేపీ నేత తమిళ్ సై గవర్నర్ గా నియిమితులయిన దగ్గర నుంచి రాజ్ భవన్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు కేసీఆర్. అయితే తాజాగా కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ఆర్టీసీ సమ్మె, కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ గవర్నర్ తో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News