జగన్ ఆ హామీ ఇస్తే…. వైసీపీలో చేరతా

అమరావతిలోనే రాజధానిగా కొనసాగిస్తే తాను వైసీపీలో చేరడానికి రెడీ అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రవాణా శాఖ కేసులో జైలుకెళ్లిన ప్రభాకర్ రెడ్డి నిన్ననే బెయిల్ [more]

Update: 2020-08-07 09:04 GMT

అమరావతిలోనే రాజధానిగా కొనసాగిస్తే తాను వైసీపీలో చేరడానికి రెడీ అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రవాణా శాఖ కేసులో జైలుకెళ్లిన ప్రభాకర్ రెడ్డి నిన్ననే బెయిల్ పై విడుదలయ్యారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాజధానిని అమరావతిలో కొనసాగిస్తానని జగన్ ప్రకటిస్తే తాను వైసీపీలో చేరతానన్నారు. తనను రాజకీయాల నుంచి తప్పుకోమన్నా అలాగే చేస్తానని చెప్పారు. అమరావతి కోసం కొన్ని నెలలుగా చేస్తున్న రైతుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను ఎన్టీఆర్ హయాంలో 11 రోజుల పాటు జైలుకెళ్లానని, ఇప్పడు జగన్ పాలనలో 54 రోజులు జైలులో ఉన్నానని తెలిపారు. తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News