చంద్రబాబు ఎదుటే బాంబు పేల్చిన జేసీ

Update: 2018-08-25 12:03 GMT

కొందరు తెలుగుదేశం పార్టీ నేతలే చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారని, వారు ఇదే వేదిక మీద ఉన్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు ముందే వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ధర్మ పోరాట దీక్షలో జేసీ దివాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో చంద్రబాబును, ఇతర టీడీపీ నేతలను ఇరుకునపడేశారు. ధర్మపోరాట దీక్షలు వేస్ట్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన ద్రోహం గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తాడని తనకేం ఆశ లేదని స్పష్టం చేశారు.

ఇరుకున పడ్డ చంద్రబాబు

బీజేపీతో విడాకులు తప్పవని చంద్రబాబుకు ఆనాడే చెప్పానని పేర్కొన్నారు. చంద్రబాబు చేతికి ఎముక లేదని, అడిగిన వారికి అడిగినట్లు ఇస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలను మరిచిపోతారేమో కానీ, సాగునీరు ఇస్తే తరతరాలు మరిచిపోరని, సంక్షేమ పథకాలను తగ్గించి ప్రాజెక్టులు నిర్మించాలని బాబుకు సూచించారు. జేసీ మాట్లాడుతున్నంత సేపూ చంద్రబాబు సహా వేదిక మీదున్న టీడీపీ నేతలు ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వేదికపై ముందు వరుసలో జేసీ కాలు మీద కాలు వేసుకుని ధర్జాగా కూర్చోవడం గమనార్హం

Similar News