కేసీఆర్ పై జేసీ హాట్ కామెంట్స్

Update: 2018-10-06 08:19 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన భాష మార్చుకోవాలన్నారు. చంద్రబాబు హుందాగా మాట్లాడతారని, అదే కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య తేడా అని పేర్కొన్నారు. తప్పులు చేసే వారిపై ఐటీదాడులు తప్పుకాదని, కానీ రాజకీయ కక్షతో బెదిరింపు ధోరణిలో దాడులు చేయడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి కోట్ల అక్రమాలు చేశారని ప్రచారం చేశారని.. తీరా చూస్తే తుస్సుమందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీది ఫ్యాక్షనిస్టు మనస్వత్వం అని, ఈ విషయాన్ని తాను ముందే చెప్పానన్నారు. ప్రభోదానంద స్వామి ఓ క్రిమినల్ అని, అతడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

Similar News