విధిలేని పరిస్థితుల్లోనే టీడీపీలో చేరా.. జేసీ సంచలన వ్యాఖ్యలు

పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను చంద్రబాబుకు చెప్పినా వినలేదని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అన్ని రకాలుగా జగన్ అడ్డుకుని, పంచాయతీలను సొంతం [more]

Update: 2021-03-22 01:07 GMT

పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను చంద్రబాబుకు చెప్పినా వినలేదని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అన్ని రకాలుగా జగన్ అడ్డుకుని, పంచాయతీలను సొంతం చేసుకుంటాడని తాను చెప్పినా చంద్రబాబు వినలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఒక ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. తాను జగన్ కు ప్రధమ శత్రువు కాదన్నారు. చంద్రబాబుపై ఎప్పుడో కేసులు నమోదు చేయాల్సి ఉందన్నారు. ఇంత ఆలస్యమవ్వడం తనకు ఆశ్చర్యం కల్గించిందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను చంద్రబాబును ద్వేషినని, జగన్, చంద్రబాబుల్లో పోల్చుకుని విధిలేని పరిస్థితుల్లో తాను టీడీపీలో చేరానని జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News