శిఖా చౌదరిపై కేసు….!!

జయరాం హత్య కేసులో ఆయన మేన కోడలు శిఖా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 448, 380, 506 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమెపై కేసు [more]

Update: 2019-02-26 06:12 GMT

జయరాం హత్య కేసులో ఆయన మేన కోడలు శిఖా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 448, 380, 506 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంట్లోకి ప్రవేశించి కొన్ని కీలక పత్రాలను శిఖా చౌదరి తీసుకెళ్లారని ఇప్పటికే జయరాం కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. జయ్ రాం భార్య పద్మ శ్రీ గతం లోనే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన పోలీస్ పూర్తి స్థాయిలో విచారణ చేశారు. పద్మ శ్రీ అమెరికా కు వెళ్లి పోయారు. దీంతో తాజాగా జయరాం మామ పిచ్చయ్య చౌదరి ఆధారాలతో సహా మరోసారి ఫిర్యాదు చేయడంతో శిఖాపై కేసు నమోదైంది శిఖ చౌదరి తో పాటు మరొకరిపై 448(అక్రమంగా ప్రవేశించడం). 380(చోరీ). 506(బెదిరింపులు) కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

Tags:    

Similar News