బాబుకు పవన్ సీరియస్ వార్నింగ్

Update: 2018-06-02 10:59 GMT

తాను ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి అంటున్నారని, నేను రెచ్చగొట్టడం లేదని సత్యం మాట్లాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీరు ఇలానే అవినీతి చేస్తే రోడ్డుపై తిరగకుండా చేస్తానని హెచ్చరించారు. శనివారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురంలో మాట్లాడుతూ... ప్రజా వ్యతిరేక పనులు చేస్తే తాను చేతులు ముడుచుకోని కూర్చోనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ రాజధాని కడతానని చెబుతున్న చంద్రబాబు కనీసం తుఫాను షెల్టర్లు, మత్య్సకారులకు జెట్టీలు కూడా కట్టలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికీ బ్రిటీష్ వారు కట్టిన తుఫాన్ షెల్టర్లే ఉన్నాయని పేర్కొన్నారు. 15వేల కిలోమీటర్లు రోడ్లు వేశామంటున్నారని కానీ, కంకరతేలిన రోడ్లు ఎందుకు కనపడుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజా ప్రభుత్వం ఉండాలని, వలసలు ఆగాలని ఆశించానని, కానీ, అలా జరగలేదన్నారు. ఇసుక మాఫియా పేట్రేగిపోతుందని, 2050 నాటికి విజయనగరం జిల్లాలో గుప్పెడు ఇసుక కూడా దొరకని స్థాయిలో టీడీపీ నాయకులు దోచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గతంలో విజన్ 2020 అన్నారని, 2020 కల్లా అభివృద్ధి కాదు కదా, రాష్ట్ర రెండు ముక్కలైందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ విజన్ 2050 అంటున్నారని ఎద్దేవా చేశారు.

Similar News