వైసీపీకి అండగా నిలిచిన జనసేన, సీపీఐ

Update: 2018-07-24 07:38 GMT

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా జరుగుతోంది. బంద్ ను విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొందరు ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్ట్ చేశారు. బంద్ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ లను సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...ప్రత్యేక హోదా కోసం జరిగే కార్యక్రమాన్ని అణిచివేయం సరికాదన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలంగా ఉండటంతో యూటర్న్ తీసుకున్నారన్నారు. జనసేన పార్టీ సైతం వైఎస్సార్సీపీ నేతల అరెస్టులను ఖండించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Similar News