రెండు రోజులుగా పవన్ ఢిల్లీలో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. పవన్ కల్యాణ‌్ బీజేపీ నేతలతో సమావేశం అవుతారనుకున్నా ఇప్పటి వరకూ ఎలాంటి భేటీలు జరగలేదు.ఈరోోజు [more]

Update: 2020-01-13 05:04 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. పవన్ కల్యాణ‌్ బీజేపీ నేతలతో సమావేశం అవుతారనుకున్నా ఇప్పటి వరకూ ఎలాంటి భేటీలు జరగలేదు.ఈరోోజు పార్టీ నేత అమిత్ షా, రామ్ మాధవ్ లతో సమావేశం అవుతారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ అధికారికంగా వారి అపాయింట్ మెంట్ పవన్ కల్యాణ్ కు లభించలేదు. మరోవైపు ఆర్ఎస్ఎస్ నేతలను కూడా కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని అమరావతి అంశంపై కేంద్రం పెద్దలతో చర్చించేందుకు రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News