బ్రేకింగ్: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా బాంబు పేల్చారు. జమ్మూ నగరంలోని ఓ బస్ స్టాండ్ లో బస్సులో ఈ [more]

Update: 2019-03-07 07:08 GMT

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా బాంబు పేల్చారు. జమ్మూ నగరంలోని ఓ బస్ స్టాండ్ లో బస్సులో ఈ గ్రెనేడ్ బాంబు పేల్చారు. బస్సులో ఎక్కువ మంది లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది కానీ ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి చికిత్స చేయిస్తున్నారు. ఇక, హంద్వారాలో జిల్లాలో భారత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఎటువంటి అల్లర్లు జరగకుండా హంద్వారా జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

Tags:    

Similar News