జగపతి బాబు ఒక్కరే ధైర్యం చేశారా..?

Update: 2018-11-24 06:27 GMT

ఒకప్పుడు హీరోగా... ప్రస్తుతం విలన్ గా దూసుకుపోతున్న జగపతి బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఇదేదో సినిమా విషయంలో కాదు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్క సుహాసినికి రాజకీయంగా మద్దతు ఇస్తూ తాజాగా జగపతి బాబు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసాడు. నందమూరి సుహాసిని హరికృష్ణ కూతురిగా... బాలయ్య అండదండలతో కూకట్ పల్లి బరిలోకి మహాకూటమి ఎమ్యెల్యే అభ్యర్థిగా దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తమ్ముళ్లని కాదనుకుని బాబాయ్ బాలకృష్ణ సహకారంతో నామినేషన్ వెయ్యడం, బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవడం ఇవన్నీ చూస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఏదో తప్పదన్నట్టుగా మా అక్కయ్య సుహాసిని అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని అన్నదమ్ములులిద్దరు కలిసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు కానీ మళ్లీ సుహాసిని గురించి ఎక్కడా ఒక్కమాట కూడా మట్లాడడం లేదు. అసలు వారు కనీసం ఎన్నికల ప్రచారానికి వస్తారన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే మొన్నామధ్యన బాలకృష్ణ తాను సుహాసిని తరుపున ఎన్నికల ప్రచారానికి వస్తానని.. మిగతా వారి గురించి తనకు తెలియదన్నట్లుగా మాట్లాడి అందరిలో అనుమానాలు రేకిత్తించాడు.

కొడాలి నాని ప్రచారం చేస్తారన్నా...

ఇక ఇండస్ట్రీలోని వారు కూడా ఎవరూ సుహాసినికి సపోర్ట్ అన్న మాట లేదు. కేవలం జగపతి బాబు తప్ప. సుహాసిని నామినేషన్ వెయ్యగానే జగపతి బాబు సుహాసినికి మద్దతు తెలిపాడు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ సన్నిహితులెవరూ కూడా సుహాసిని మద్దతివ్వడం లేదు. మనకెందుకు అనుకున్నారా? లేదంటే ఎలాగూ కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణలో వస్తుంది.. ఇక కేసీఆర్ మళ్లీ సీఎం అయితే సుహాసినికి మద్దతిచ్చినందుకు మనకేమన్నా నష్టమా అని ఆలోచిస్తున్నారా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా ఉన్న వ్యవహారమే. ఇక హరికృష్ణ, ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడు గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నాని కూడా సుహాసిని మద్దతుగా కూకట్ పల్లిలో ప్రచారం చేస్తున్నాడని, వైఎసార్సీపికి, జగన్ కి కొడాలి నాని షాక్ ఇస్తాడనే టాక్ కూడా నడిచింది. కానీ నాని మాత్రం ఎక్కడా సుహాసిని ప్రచారంపై మాట్లాడడం లేదు. మరిదంతా చూస్తుంటే జగపతి బాబు... బాలయ్య, ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉందని.. అరవింద సమేత సక్సెస్ మీట్ అప్పుడు స్టేజ్ మీద చెప్పడమే కాదు... వారితో ఒక ఫోటో దిగాలని కోరికను తీర్చుకున్నాడు. కానీ పైన చెప్పినట్లుగా ఎన్టీఆర్, బాలయ్య కలవడం అటుంచి.. ఇప్పుడు నందమూరి సుహాసిని వలన మరోమారు నందమూరి ఫ్యామిలిలో లుకలుకలు బయటికొస్తున్నాయనిపిస్తుంది.

Similar News