ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాల ఘటనలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనను ఆయన ఖండిస్తూ ట్వీట్ చేశారు. మీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ లో భద్రత లేదని ఆయన చంద్రబాబును విమర్శించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతున్నా అరికట్టలేకపోతున్నారని ఆయన విమర్శించారు.