లండన్ పర్యటనకు వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం లండన్ వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఐదు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. జగన్ [more]

Update: 2019-01-16 11:05 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం లండన్ వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఐదు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. జగన్ కూతురు లండన్ లో ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు ముందు ఆయన లండన్ వెళ్లి కుమార్తెను చూసి వచ్చారు. పాదయాత్ర పూర్తి కావడంతో 15 నెలల తర్వాత మళ్లీ ఆయన కూతురిని చూడటానికి వెళుతున్నారు. 22వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.

Tags:    

Similar News