బ్రేకింగ్ : సమర శంఖం పూరిస్తున్న జగన్

పాదయాత్ర తర్వాత కొన్నిరోజులుగా హైదరాబాద్ లో ఉంటున్న జగన్ ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా [more]

Update: 2019-01-25 09:39 GMT

పాదయాత్ర తర్వాత కొన్నిరోజులుగా హైదరాబాద్ లో ఉంటున్న జగన్ ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో అనంతపురం, కడప, తిరుపతిలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. తర్వాత మిగతా జిల్లాల్లోనూ ఆయన బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడనున్నారు. ఈ సమావేశాలు పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News