ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టులో?

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వరస షాక్ లు తగులుతున్నాయి. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై కేసును కొట్టివేసింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్ సైడర్ [more]

Update: 2021-09-02 08:18 GMT

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వరస షాక్ లు తగులుతున్నాయి. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై కేసును కొట్టివేసింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. గతంలో దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ పిటీషన్ ను విత్ డ్రా చేసుకుంది. దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు తీర్పు చెప్పింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడా జరగలేదని తీర్పు చెప్పింది. దమ్మాలపాటి తనపై కేసు పెట్టినందుకు న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చని కూడా హైకోర్టు సూచించింది.

Tags:    

Similar News