బాబు నమస్కారాలపై జగన్ ఎద్దేవా...!

Update: 2018-06-18 12:43 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి ఉత్తరకుమార ప్రగల్భాలని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్రాన్ని నిలదీస్తాం, యుద్ధం చేస్తామని చెప్పి ఢిల్లీ వెళ్లి వంగివంగి నమస్కారాలు పెట్టి అతివినయం ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర సోమవారం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం చేరుకుంది. సోమవారం సాయంత్రం పి.గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల సమక్షంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి అన్యాయం చేసేలా మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పకుండా, రాష్ట్రం అభివృద్ధిలో పరిగెడుతోందని, దేశం కంటే రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోతుందని చెప్పారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మేము నష్టపోతున్నాం అని చెప్పకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెబితే ప్రత్యేక హోదా ఇస్తారా అని ప్రశ్నించారు.

Similar News